న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి ఓ సందేశాన్ని పంపించారు. ‘నా పేరు కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాను’ అని కేజ్రీవాల్ సందేశం పంపారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.
బీజేపీ కక్షసాధింపు ధోరణితో ఆయనను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నదన్నారు. ఓ ఉగ్రవాదితో వ్యవహరించినట్టు కేజ్రీవాల్ పట్ల జైలు అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు.