శ్రీనగర్, మే 2: సైఫ్ అలీ వయస్సు 80 ఏండ్లు. జమ్ముకశ్మీర్కు చెందిన ఈ వృద్ధుడి రెండు ఇండ్లను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. నాలుగు నెలలుగా ఈ వృద్ధుడికి గూడు లేదు. ఆరుబయటే ఉంటున్నారు.
ఈ సమస్య ఒక్క సైఫ్ అలీదే కాదు. జనవరి 11న రూప్నగర్కు చెందిన గుజ్జర్, బకర్వాల్ గిరిజన తెగల కుటుంబాల ఇండ్లను జమ్ము డెవలప్మెంట్ అథారిటీ కూల్చివేసింది. వాళ్లు ఆ స్థలాలను ఆక్రమించుకొన్నారని ఆరోపించింది. మంగళవారం రంజాన్ పండుగ. ఇల్లు లేక.. ఎక్కడికీ వెళ్లలేక పండుగపూట ఈ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.