దేశంలో ముస్లిం ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకోవడంపై ఏఐఎంపీఎల్బీ
లక్నో, మే 18: దేశంలోని ముస్లింల ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు (ఏఐఎంపీఎల్బీ) కోరింది.
జ్ఞాన్వాపీ మసీదు కేసులో ఇంతజామియా కమిటీకి, న్యాయవాదులకు న్యాయసహాయం అందించాలని బోర్డు వర్కింగ్ కమిటీ మంగళవారం జరిపిన అత్యవసర ఆన్లైన్ సమావేశంలో నిర్ణయించింది. ప్రార్థనా మందిరాల విషయమై వివాదాలు రెచ్చగొట్టడం వెనుకనున్న అసలు ఉద్దేశాలను బయటపెట్టేందుకు అవసరమైతే దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని తీర్మానించింది.