షాజహాన్పూర్, మే 5: కరోనా సోకి మరణించిన ఓ హిందూ మహిళకు అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో ఓ ముస్లిం జర్నలిస్టు ఆ పని పూర్తి చేశాడు. ఈ ఘటన యూపీలోని షాజహాన్పూర్లో జరిగింది. సునీతాదేవి (70) ప్రభుత్వ షెల్టర్ హోంలో ఉండేది. గత గురువారం ఆమె మరణించగా మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచారు. విషయం తెలుసుకున్న మెరాజుద్దీన్ఖాన్ అనే జర్నలిస్టు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.