న్యూఢిల్లీ: ముంబై నుంచి గువాహటి వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo flight) బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) అయింది. ఇండిగో ఎయిల్లైన్స్కు చెందిన 6ఈ5319 విమానం ముంబై నుంచి గువాహటి బయల్దేరింది. అయితే గువాహటి విమానాశ్రయంపై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో సరిగా కనిపంచక ల్యాండింగ్ సాధ్యంమవలేదు. దీంతో విమానాన్ని ఢాకాకు దారిమళ్లించారు. శనివారం ఉదయం 4 గంటలకు ఢాకాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఇండిగో ప్రకటించింది.
విమానంలో ఉన్న ప్రయాణికులంతా పాస్పోర్ట్ లేకుండానే దేశ సరిహద్దులు దాటామని అందులో ప్రయాణిస్తున్న ముంబై యూత్ కాంగ్రెస్ చీఫ్ సూరజ్ సింగ్ ఠాకూర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో రాసుకొచ్చారు. గువాహాటిని మంచుదుప్పటి కప్పేయడంతో ఎయిర్పోర్ట్లో విమానం దిగడానికి వీలుపడలేదు. దీంతో తాము ఢాకాలో ల్యాండ్ అయ్యామని చెప్పారు. ప్రస్తుతం విమానంలోనే ఉన్నామన్నారు.
I took @IndiGo6E flight 6E 5319 from Mumbai to Guwahati. But due to dense fog, the flight couldn’t land in Guwahati. Instead, it landed in Dhaka. Now all the passengers are in Bangladesh without their passports, we are inside the plane.✈️
— Suraj Singh Thakur (@SurajThakurINC) January 13, 2024