ముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి దగ్గర 4.9 కిలోల హెరాయిన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన హెరాయిన్ విలువ రూ.35 కోట్లు ఉంటుందని చెప్పారు. ఒక ప్యాసెంజర్ విదేశాల నుంచి ముంబైకి డ్రగ్స్ తరలిస్తున్నాడనే పక్కా సమాచారంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు.
కెన్యా రాజధాని నైరోబీ నుంచి ముంబైకి వచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతని ట్రాలీ బ్యాగ్ని తనిఖీ చేశారు. ట్రాలీ బ్యాగ్లో నల్లని పాలీథీన్ కవర్లో 4.9 కిలోల హెరాయిన్ దొరికింది. దాంతో, అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.