Gold Seized | ముంబయి ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల రెండు మూడురోజుల వ్యవధిలో 17 వేర్వేరు కేసుల్లో 9.83 కిలోల బంగారంతో పాటు ఐఫోన్లు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని బట్టలు, ప్లాస్టిక్ ప్లేట్లు, టాంగ్ పౌడర్, క్యాబిన్ బ్యాగుల్లో పెట్టి తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.5కోట్లకుపైగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారా? బంగారాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు ? అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు కస్టమ్స్ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా.. ఈ నెల 12 నాటికి విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు రూ.12 కోట్లకుపైగా విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9 నుంచి 11 మధ్య విమానాశ్రయ కస్టమ్స్ కమిషనరేట్ అధికారులు రూ.97లక్షల విలువైన 1.76 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 3న మరో కేసులో దుబాయి నుంచి వచ్చిన భారతీయ ప్రయాణికుడి నుంచి నుంచి ప్రయాణిస్తున్న భారతీయుడి నుంచి కస్టమ్స్ అధికారులు రూ.1.43కోట్ల విలువన గోల్డ్ డస్ట్, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ బాక్సుల్లో, బేబీ పౌడర్ కంటైనర్లలో చాకచక్యంగా బంగారాన్ని దాచి తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు వివరించారు.