vehicle pileup | ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా (Greater Noida )లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగమంచు (dense fog) కారణంగా సుమారు అరడజనుకుపైగా వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి (vehicle pileup). ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దాద్రి బైపాస్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొన్ని కార్లు ట్రక్కు వాహనాల్లో ఇరుక్కుపోయాయి.
మరోవైపు ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారు తెలిపారు.
కాగా, గత కొన్నిరోజులుగా ఉత్తరాది రాష్ట్రాలు చలికి గజగజ వణుకుతున్నాయి. చలికి తోడు ఆయా రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. కొన్ని ఏరియాల్లో దృశ్యమానత జీరోకు పడిపోయింది. సమీపంలోని వాహనాలు కనిపించని పరిస్థితి. ఇక మంగళవారం దేశరాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ పొగ మంచు రైలు, విమానాల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.
Also Read..
Delhi | ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. విమాన సర్వీసులకు అంతరాయం
Houthi Rebals | మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్.. అమెరికా నౌకపై క్షిపణితో దాడి