న్యూఢిల్లీ, మే 8: ఈ ఏడాది జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓటు విలువ 708 నుంచి 700కు పడిపోయే అవకాశం ఉన్నది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఇందుకు కారణమని సంబంధిత అధికారులు శనివారం పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఎంపీ ఓటు విలువ అనేది జమ్ముకశ్మీర్తో పాటు అన్ని రాష్ర్టాలు, యూటీల అసెంబ్లీలకు ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, అసెంబ్లీల ఎమ్మెల్యేలు ఉంటారు.