బెంగళూర్ : రాజ్యంగాన్ని మార్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డేను పార్టీ పక్కనపెట్టింది. ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం నుంచి గత 28 ఏండ్లుగా ఆరుసార్లు గెలిచిన అనంత్ కుమార్ హెగ్డేకు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది.
అనంత్ హెగ్డే స్ధానంలో మాజీ మంత్రి, కర్నాటక అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విశ్వేశ్వర్ హెగ్డే కగెరిని దక్షిణ కర్నాటక స్ధానం నుంచి బీజేపీ బరిలో నిలపనుంది. కాగా, హిందువులను అణిచివేసేందుకు కాంగ్రెస్ గతంలో రాజ్యాంగాన్ని మార్చిందని ఇటీవల అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాజ్యాంగాన్ని తిరిగి రాయాల్సిన అవసరం ఉందని అన్నారు.
హిందూ సమాజాన్ని అణిచివేసే చట్టాలను కాంగ్రెస్ తీసుకువచ్చిందని బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీతో పాటు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ మెరుగైన ఫలితాలను పొందాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై విపక్షం విరుచుకుపడటంతో ఎంపీ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాషాయ పార్టీ స్పష్టం చేసింది. ఎంపీ హెగ్డే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని పేర్కొంది.
Read More :
Maha Rally | 31న మహార్యాలీ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై నిరసనకు విపక్షాల పిలుపు