Gopal yadav | అయోధ్య రామ మందిర నిర్మాణంపై సమాజ్వాదీ ఎంపీ గోపాల్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. తాము గనక యూపీలో అధికారంలోకి వస్తే, బీజేపీ కంటే చాలా వేగంగా అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేసి చూపిస్తామని ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా చిత్రకూట్లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. అఖిలేశ్ ఎంత ప్రయత్నించినా రామ మందిర నిర్మాణం ఆగదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సమాజ్వాదీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ పై వ్యాఖ్యలు చేశారు. అసలు రామ మందిర నిర్మాణాన్ని ఎవరు ఆపుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాము గనక అధికారంలోకి వస్తే, ఆలయాల విరాళాలను దొంగలించే పనికి అడ్డుకట్ట వేస్తామని అన్నారు. ‘నిజానికి బీజేపీ వారే అలా చేస్తున్నారు. అఖిలేశ్ గనక అధికారంలోకి వస్తే.. రామ మందిర నిర్మాణాన్ని మరింత వేగంగా పూర్తి చేస్తాం. తాము అధికారంలోకి వస్తే ఆలయ విరాళాల దొంగతనానికి అడ్డుకట్ట వేసేస్తాం’ అని సమాజ్వాదీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు.