న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 78వ జన్మదినం సందర్భంగా ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా అంజలి ఘటించారు. ఢిల్లీలోని వీర్భూమిలో ఉన్న రాజీవ్ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికర్జున ఖర్గే, ఎంపీ కేసీ వేణుగోపాల్, రాబర్ట్ వాద్రా తదితరులు మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించారు. పార్టీ అధినేత, రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ కరోనాతో బాధపడతున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కాగా, రాజీవ్గాంధీ జన్మదినాన్ని ప్రతిఏటా సద్భావన దినోత్సవంగా నిర్వహిస్తారు.
Delhi | Congress MP Rahul Gandhi, general secretary Priyanka Gandhi Vadra, Robert Vadra, MP KC Venugopal, and LoP Mallikarjun Kharge pay homage to former PM Rajiv Gandhi, on his 78th birth anniversary at Vir Bhumi. pic.twitter.com/Pqoc4YU1hl
— ANI (@ANI) August 20, 2022