న్యూఢిల్లీ: ఎంపీ నవనీత్ రాణా హనుమాన్ చాలీసా పఠించారు. అయితే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీ వద్ద కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో. ఇటీవలే బెయిల్పై విడుదలైన అమరావతి ఎంపీ నవనీత్ రాణా (MP Navneet Rana) దంపతులు ఢిల్లీకి చేరుకున్నారు. తన భర్త ఎమ్మెల్యే రవితో కలిసి కన్నాట్ ప్లేస్లో ఉన్న ఆంజనేయుని ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించారు.
#WATCH | Amravati MP Navneet Rana recites Hanuman Chalisa at Hanuman Temple, CP in Delhi. Her husband & Maharashtra MLA Ravi Rana also present with her.
They were arrested in April and later released on bail over the row to recite Hanuman Chalisa outside Maharashtra CM's house. pic.twitter.com/9yQZHkqlMt
— ANI (@ANI) May 14, 2022
గత నెల 23న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం ముందు హనుమాన్ చాలీసా చదువుతామని నవనీత్ రాణా దంపతులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ముంబైలోని ఆమె ఇంటి ముందు శివసేన పార్టీ కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శించారు. అనంతరం ఆ వ్యాఖ్యలను ఎంపీ దంపతులు ఉపసంహరించుకున్నారు.
అయితే మతకలహాలకు దారితీసేలా ప్రవర్తించారని నవనీత్ రాణా దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై రాజద్రోహం కింద కేసు నమోదుచేశారు. ఈ కేసులో బాంద్రాలోని మెట్రొపాలిటన్ కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కాగా, ఈ నెల 4న ముంబై కోర్టు వారికి బెయిల్ మంజూరుచేసింది.