కోల్కతా: లోక్సభలో ప్రశ్నలు అడగడానికి తాను లంచం తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమేనని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే పార్లమెంటు నైతిక విలువల కమిటీ స్త్రీ ద్వేషం నుంచి తనకు రక్షణ కల్పించాలని అన్నారు.
ఈ కమిటీ గురువారం తనను కించపరిచేవిధంగా ప్రశ్నించిన తీరుపై లోక్సభ సభాపతి ఓం బిర్లాకు లేఖ రాశానని తెలిపారు. ఎంపీలు తమ ఎన్ఐసీ లాగిన్ ఐడీలను ఇతరులకు ఇవ్వరాదని తెలిపే నిబంధనలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.