కోల్కతా : డబ్బు కోసం 21 రోజుల పసికందును కన్నతల్లి మరో మహిళకు రూ. 4 లక్షలకు విక్రయించిన ఘటన కలకలం రేపింది. కోల్కతాకు చెందిన రూపాలి మొండల్ ఈ ఘాతుకానికి పాల్పడింది. రోజుల వయసున్న కూతురును నగరంలోని రైల్ కాలనీకి చెందిన మహిళ రూపాలి విక్రయించిందని ఆనంద్పూర్ పోలీసులకు సమాచారం రావడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
తల్లిని ప్రశ్నించగా ఆమె సంతృప్తికర సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో రూపాలి తన నేరాన్ని అంగీకరించింది. మహిళ స్టేట్మెంట్ ఆధారంగా రూపా దాస్, స్వప్న సర్దార్ అనే మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. రూపాలి ఇంటి పొరుగున ఉండే ప్రతిమా భునియా ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
విచారణలో మిడ్నాపూర్కు చెందిన కళ్యాణి గుహ వద్ద నవజాత శిశువు ఉన్నట్టు తెలియడంతో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు బిడ్డను కాపాడి కళ్యాణిని అరెస్ట్ చేశారు. కళ్యాణికి 15 ఏండ్ల కిందట వివాహం కాగా సంతానం లేకపోవడంతో శిశువును కొనుగోలు చేసినట్టు తెలిసింది. శిశువును కాపాడిన పోలీసులు చైల్డ్కేర్ యూనిట్కు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More :
Monu Manesar: ఎవరీ మోనూ మనేసర్? హర్యానా హింసతో అతనికి లింకేంటి?