న్యూఢిల్లీ: అముల్ బాటలో మదర డెయిరీ అడుగులు వేసింది. లీటరు పాలపై రూ.2 పెంచినట్లు మదర్ డెయిరీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్, ఇతర నగరాల్లో ఈ పెంచిన ధరలు ఆదివారం నుంచే అములోకి రానున్నాయి. డెయిరీ రైతుల నుంచి పాల సేకరణ ధరలు గత ఏడాది 8 నుంచి 10 శాతం పెరిగినట్లు మదర్ డెయిరీ వెల్లడించింది. డిసెంబర్ 2019లో చివరిసారి మదర్ డెయిరీ పాలపై ధరలను పెంచింది. జూలై ఒకటి నుంచి అముల్ కూడా లీటరు పాలపై రెండు రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. యూపీలోని పలు నగరాలు, ముంబై, నాగపూర్, కోల్కతాలోనూ పాల ధరలను పెంచుతున్నారు. దేశవ్యాప్తంగా సుమారు వంద నగరాల్లో మదర్ డెయిరీ పాలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఒక్క ఢిల్లీలోనే ప్రతి రోజు సుమారు 30 లక్షల లీటర్ల పాలను అమ్ముతున్నారు.