న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర దాడులతో ఇజ్రాయెల్లో భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారత పౌరులందరూ సురక్షితంగా ఉండాలని, ఎలాంటి సాయం కావాలన్నా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీ. మురళీధరన్ (MoS Muraleedharan) విజ్ఞప్తి చేశారు.
ఇజ్రాయెల్లో భారత పౌరులందరికీ భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలు జారీ చేసిందని, మన పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్ధితి ఉత్పన్నమైనా ఎంబసీతో సంప్రదింపులు జరపాలని కోరామని తెలిపారు.
ఇజ్రాయెల్లో ఉన్న భారత పౌరులందరూ జాగ్రత్తగా ఉండాలని, స్ధానిక అధికారులు నిర్ధేశించిన భద్రతా ప్రమాణాలను అనుసరించాలని ఇజ్రాయెల్లో భారత రాయబార కార్యాలయం శనివారం భారత పౌరులకు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, అనవసరంగా బయటతిరగకుండా జాగ్రత్తలు పాటించాలని ఈ గైడ్లైన్స్లో కోరింది. ఇక ఇజ్రాయెల్లో హమాస్, ఇజ్రాయెల్ సైనిక బలగాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి.
Read More :
Israeli tourists shot dead | ఈజిప్టులో కాల్పులు.. ఇద్దరు ఇజ్రాయిల్ పర్యాటకులు మృతి