కైరో: ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం తాజాగా ఈజిప్టునకు వ్యాపించింది. అక్కడ జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయిల్ పర్యాటకులు మరణించారు. (Israeli tourists shot dead) ఈజిప్ట్ జాతీయుడు కూడా ఈ కాల్పుల్లో చనిపోగా మరో ఇజ్రాయిల్ పర్యాటకుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం అలెగ్జాండ్రియాలోని పాంపీస్ పిల్లర్ సైట్ వద్ద ఇజ్రాయిల్ పర్యాటకులపై ఈజిప్ట్ పోలీస్ అధికారి కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఇద్దరు ఇజ్రాయిల్ పర్యాటకులు, ఈజిప్ట్ వ్యక్తి మరణించారు. మరో ఇజ్రాయిల్ వ్యక్తికి గాయాలయ్యాయి.
కాగా, ఈజిప్ట్ భద్రతా బలగాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇజ్రాయిల్ పర్యాటకులపై కాల్పులు జరిపిన ఈజిప్ట్ పోలీస్ను అదుపులోకి తీసుకున్నాయి. మరణించిన, గాయపడిన ఇజ్రాయిల్ పర్యాటకులను మూడు అంబులెన్స్లలో హాస్పిటల్కు తరలించారు. ఈ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు పాలస్తీనాలోని గాజాలో ఆదిపత్యం చెలాయిస్తున్న హమాస్ శనివారం అనూహ్యంగా ఇజ్రాయిల్పై 5,000 క్షిపణులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇరువైపు దాడుల్లో సుమారు వెయ్యి మంది మరణించగా వందల సంఖ్యలో గాయపడ్డారు.
إقروا الفاتحة لأبو العبااااااس.. اسكندرية يا اجدع ناااس يا اجدع نااااس pic.twitter.com/XWcGm6IvJp
— أحمد سامح (@AhmedSamehAhly) October 8, 2023
Two Israeli tourists were killed by an Egyptian policeman in Alexandria, Egypt.
Egypt Media.#Hamas #Israel #GazaUnderAttack #Palestine #طوفان_الأقصى #Egypt— Arslan Baloch (@balochi5252) October 8, 2023