న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఆర్థిక నేరాలకు కారణమయ్యే వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు, పార్ట్టైం జాబ్ మోసాలకు పాల్పడుతున్న 100కుపైగా వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్న ఈ వెబ్సైట్లు ప్రధానంగా పార్ట్ టైం ఉద్యోగం కోసం వెతుకుతున్న రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొన్నాయి.
కేంద్ర హోంశాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ఈ వెబ్సైట్ల మోసాలను గుర్తించి వాటిని బ్లాక్ చేయాల్సిందిగా నివేదించింది. స్పందించిన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ సమాచార సాంకేతిక చట్టం-2000 కింద ఈ వెబ్సైట్లను బ్లాక్ చేసింది.