తిరువనంతపురం: భారతీయ వాతావరణ శాఖ ఇవాళ కీలక ప్రకటన చేసింది. మరో 24 గంటల్లో కేరళకు నైరుతీ రుతుపవనాలు(Monsoon) రానున్నట్లు ఐఎండీ వెల్లడించింది. అంటే రేపటి నుంచి వర్షాకాలం ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. వివిధ వాతావరణ అంశాల ఆధారంగా నైరుతీ ఆగమనంపై ఐఎండీ ప్రకటన చేసింది. ఆరేబియా సముద్రంపై నైరుతీ పవనాలు బలపడినట్లు అంచనా వేశారు. దీంతో తేమశాతం పెరిగింది. మే 31వ తేదీ నాటికి కేరళకు నైరుతీ రుతుపవనాలు చేరుకుంటాయని తొలుత ఐఎండీ అంచనా వేసింది. కానీ ఒక రోజు ముందే వర్షాలు కేరళకు చేరుకోనున్నట్లు తాజాగా ఐఎండీ తెలిపింది.గత ఏడాది జూన్ 8వ తేదీన నైరుతీ కేరళ తీరాన్ని తాకింది. 2022లో కూడా మే నెలలోనే కేరళకు నైరుతీ చేరుకున్నది. ఆ ఏడాది మే 29వ తేదీన ప్రకటన చేశారు. వాస్తవానికి ఇప్పటికే తిరువనంతపురంలో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో ఆరెంజ్ వెదర్ అలర్ట్ను జారీచేశారు. కొల్లామ్, పాతనమిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
The conditions continue to become favourable for Monsoon onset over Kerala during next 24 hours and advance of monsoon over some parts of Northeastern States during the same period. pic.twitter.com/jDnH19EZ3r
— India Meteorological Department (@Indiametdept) May 29, 2024