కోతుల నుంచి మనుషులు పుట్టారంటారు. అది నిజమో కాదో పక్కనపెడితే.. కోతులు, మనుషులు చేసే పనుల్లో చాలా పోలికలు కనిపిస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో ఇదే విషయాన్ని ఎత్తిచూపుతోంది. ప్రస్తుత ప్రపంచంలో మనుషులు మోడ్రన్ టెక్నాలజీకి అలవాటు పడిపోతున్న సంగతి తెలిసిందే.
ఇదే బాటలో కోతులు కూడా నడుస్తున్నట్లున్నాయి. ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతున్న ఒక వీడియోలో కొన్ని కోతులు సోషల్ మీడియాలో పోస్టులు చూస్తూ కనిపిస్తున్నాయి. ఏడాది క్రితం బయటకు వచ్చిన ఈ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన మొబైల్ను రెండు కోతుల ముందు ఉంచాడు.
దానిలో ఓపెన్ చేసి ఉన్న సోషల్ మీడియా పోస్టులను కోతులు స్క్రోల్ చేసి మరీ చూస్తున్నాయి. ఇంతలో ఒక పెద్ద కోతి వచ్చి అది కూడా సోషల్ మీడియా పోస్టులు చూడటం మొదలు పెట్టింది. వెనుక నుంచి చిన్న కోతి దాన్ని పిలుస్తుండటంతో అన్యమనస్కంగానే వెనుతిరిగింది. ఈ పోస్టును షేర్ చేసి ‘‘క్రేజ్ ఆఫ్ సోషల్ మీడియా’’ అని పోస్టు చేయడంతో ఇది తెగ వైరల్ అవుతోంది.
మనుషులే కోతులకు ఇవన్నీ నేర్పించి, నిజంగానే ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ చేస్తారేమో అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో సోషల్ మీడియానా మజాకా అంటున్నారు. మనుషులు చెడిపోయింది కాక, కోతులను కూడా చెడగొట్టేస్తున్నారని మరికొందరు జోకులు వేస్తున్నారు.
Craze Of Social Media🤦♀️🤦♀️ pic.twitter.com/UiLboQLD32
— Queen Of Himachal (@himachal_queen) July 10, 2022