న్యూఢిల్లీ :ఉపాధి హామీ పథకం పనులను డ్రోన్లతో పర్యవేక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న పనితోపాటు పూర్తయిన పనిని కూడా డ్రోన్లతో పరిశీలిస్తారు. ప్రతి జిల్లాలో నియమితులైన అంబుడ్స్మన్లకు ఇది ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని అధికారులు తెలిపారు. పనుల నాణ్యత, ఇతర అంశాలను పరిశీలించడానికి వీటిని వినియోగించవచ్చు. ఎంత పరిణామంలో పనులను పరిశీలించాలన్నది రాష్ర్టాలు, యూటీలే నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.