ED Notice | మనీలాండరింగ్ కేసులో శివసేన (యూబీటీ) నేత రవీంద్ర వైకర్కు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని కోరింది. ఇటీవల ముంబయిలో ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్ధవ్ పక్షంలోని శివసేన ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు ఇచ్చింది. జోగేశ్వరి ప్రాంతంలో ఒక విలాసవంతమైన హోటల్ నిర్మాణంలో అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో జోగేశ్వరి తూర్పు నియోజకవర్గానికి రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముంబయి పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసును దర్యాప్తు చేస్తున్నది.