Karnataka Assembly Elections | మరో వారం రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Assembly Elections) జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం (Election Campaign) చేస్తున్నాయి. పలు పార్టీల నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కోట్ల కొద్దీ డబ్బులు చేతులు మారుతున్నాయి.
కాగా, తాజాగా మైసూరు (Mysore)లో ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచిన కోటి రూపాయల నగదును అధికారులు గుర్తించారు. పుత్తూరు (Puttur) నుంచి కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న అశోక్ కుమార్ రాయ్ ( Ashok Kumar Rai) సోదరుడు సుబ్రహ్మణ్య రాయ్ (Subramania Rai) ఇంట్లో అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. ఇంటి ఆవరణలోని మామిడి చెట్టు (mango tree)పై బాక్సులు ఉండటాన్ని గమనించారు. వాటిని తెరచి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం డబ్బును అధికారులు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఏప్రిల్ 13న బెంగళూరు సిటీ మార్కెట్ ఏరియాలో రూ.కోటిని పోలీసులు జప్తు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో డబ్బు తీసుకెళ్తుండగా పట్టుకున్న పోలీసులు.. ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికలు (Elections ) సమీపిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఐటీ అధికారులు ( I-T teams) దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో కోట్ల కొద్దీ సొమ్మును సీజ్ చేసి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే శనివారం నాటికి ఆ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రూ.302 కోట్ల విలువైన లెక్క చూపని నగదు, వస్తువులను ఈసీ సీజ్ చేసి స్వాధీనం చేసుకుంది. ఒక్క బెంగళూరులోనే ఏకంగా రూ.82 కోట్లను ఈసీ స్వాధీనం చేసుకుంది.
Also Read..
Sajjanar | బస్సులతో ఆటలా.. చర్యలు తప్పవు : వైరల్ వీడియోపై సజ్జనార్ ఆగ్రహం
Mohammed Shami | షమీకి ఇప్పటికీ వివాహేతర సంబంధాలున్నాయి.. మరోసారి సంచలన ఆరోపణలు చేసిన హసీన్
Body Guard | జీతం ఇవ్వలేదని.. మంత్రిని కాల్చి చంపిన బాడీగార్డ్