కోల్కత్తా, మే 9: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్గా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నాటికి ఇది తీవ్ర తుఫాన్గా మారవచ్చని పేర్కొంది. మే 12 నాటికి వాయవ్యం దిశగా బంగ్లాదేశ్, మయన్మార్ తీరం వైపు పయనిస్తుందని వెల్లడించింది. బలమైన గాలులు వీస్తాయని జాలర్లు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది.
అండమాన్, నికోబార్ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుఫాన్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమైనట్టు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తెలిపారు. తీర ప్రాంతవాసులను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామన్నారు.