Mallikarjun kharge | న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శ చేశారు. ప్రధాని మోదీని విష సర్పంతో పోల్చిన ఆయన తర్వాత తన విమర్శలకు క్షమాపణ చెబుతూ.. తాను బీజేపీ సిద్ధాంతాలను విషసర్పంతో పోల్చినట్టు వివరణ ఇచ్చారు.
‘ప్రధాని మోదీ విష సర్పం లాంటి వారు. అది విషమైనదా కాదా అని మీరు ఆలోచించవచ్చు. దానిని నాకారో చావు ఖాయం’ అంటూ కర్ణాటకలోని కలబురగిలో జరిగిన ఎన్నికల సభలో ఆయన తీవ్రంగా విమర్శించారు. కాగా, ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ సహా పలు పార్టీలు ఖండించాయి. దీంతో వెనక్కి తగ్గిన ఖర్గే తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. తాను బీజీపీ ఆలోచనా సరళిపైనే విమర్శలు చేసినట్టు ఆయన వివరించారు.