న్యూఢిల్లీ: పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన ఉగ్రవాద ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని జమ్ము కశ్మీరు మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో మాలిక్ మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలవడమే మోదీకి ముఖ్యమని, రానున్న ఎన్నికలకు ముందు అటువంటి దాడులు జరిగే అవకాశం ఉందన్నారు.
2019లో జరిగిన పుల్వామా ఉగ్రవాద దాడి, అందుకు ప్రతీకారంగా బాలాకోట్పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ను మోదీ రాజకీయం చేశారన్నారు. సైనికుల ధైర్యసాహసాలకు ఓటును అంకితం చేయాలని తొలిసారి ఓటు హక్కు పొందిన యువతను మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కోరారని గుర్తు చేశారు.