న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన మోదీ సర్కారు.. మరో రూ.6 లక్షల కోట్ల అప్పు తీసుకొనేందుకు సిద్ధమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం (అక్టోబర్ – మార్చి) కోసం రూ.6 లక్షల కోట్లు అప్పు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
అందులో రూ.16 వేల కోట్ల సావరీన్ గ్రీన్ బాండ్లు కూడా ఉన్నట్టు వెల్లడించింది. కాగా, కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారమే.. 2021 డిసెంబర్ – 2022 మార్చి మధ్య కేంద్రం అప్పు రూ.128.41 లక్షల కోట్ల నుంచి రూ.133.22 లక్షల కోట్లకు పెరిగింది. 2022-23 అంచనాల ప్రకారం అప్పు రూ.155.33 లక్షల కోట్లకు చేరింది.