Nirmala-Chidambaram | ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారధ్యంలోని ప్రభుత్వ విజయాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత పీ చిదంబరం ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం భుజాలపైనే మోదీ సర్కార్ నిలిచిందని తేల్చి చెప్పారు.
ఏ ప్రభుత్వమైనా 5-10 ఏండ్లలో సాధించిన ఫలితాలను, విజయాలను ప్రకటించుకుంటుందని నిర్మలా సీతారామన్ ఓ ఆంగ్ల దిన పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. దీనిపై చిదంబరం స్పందిస్తూ.. యూపీఏ సర్కార్ హయాంలో తీసుకొచ్చిన ‘ఆధార్’ వ్యవస్థ వల్లే విజయాలు సాధించామని మోదీ సర్కార్ చెప్పుకుంటున్నదని వ్యాఖ్యానించారు.
ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) తాము సాధించిన విజయమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కానీ ‘డీబీటీ’కి మూలమైన ఆధార్ వ్యవస్థ రూపొందించి అమలు చేసిన ఘనత యూపీఏ సర్కార్’దేనని సీతారామన్ మరిచిపోయారని వ్యాఖ్యానించారు. కానీ డీబీటీ ద్వారా తొలుత నగదు బదిలీ చేసిందే యూపీఏ సర్కార్ అని గుర్తు చేశారు.
జీఎస్టీ, ఆర్టికల్ 370, వ్యాక్సినేషన్, ట్రిపుల్ తలాక్, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులపై 15కి పైగా కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీనిపై చిదంబరం స్పందిస్తూ.. వివిధ కేసుల్లో ప్రభుత్వంపై విపక్షాలు వేసిన కేసుల్లో ఓడిపోయిందని గుర్తు చేస్తూ ఐదు ఉదాహరణలు ఇచ్చారు. పార్లమెంట్ చట్టం చేయకముందే ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధం అని సుప్రీంకోర్టు ప్రకటించిందని చిదంబరం గుర్తు చేశారు. ఆర్టికల్ 370పై కేసు ఇంకా విచారణకే రాలేదన్నారు. జీఎస్టీపై పలు కేసులో పెండింగ్ లో ఉన్నాయన్నారు.
పాలు, తేనె, ఫండ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందని నిర్మలా సీతారామన్ ప్రకటించగా, ఈ విజయాలు ఎన్నో ఏండ్ల క్రితమే సాధించామని చిదంబరం గుర్తు చేశారు.