నేషనల్ డెస్క్: చేయాలన్న తపన, చిత్తశుద్ధి ఉంటే ఎంతటి భారీ లక్ష్యాన్నైనా సునాయాసంగా సాధించవచ్చు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో ప్రారంభించిన ఎలాంటి పథకమైనా, ప్రాజెక్టు అయినా నత్తనడకన సాగుతుంది. కారణం జాతి ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. అయితే, అందులో 90 శాతం ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాకుండా డెడ్లైన్లు మార్చుకొంటూ కునారిల్లుతున్నాయి.
ప్రాజెక్ట్: ముంబై-అహ్మదాబాద్
బుల్లెట్ రైలు
ప్రాంతం: ముంబై-అహ్మదాబాద్
ఉద్దేశం: ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం
ప్రకటన: అక్టోబర్ 2018
వ్యయం: రూ. 1.10 లక్షల కోట్లు
ప్రారంభ డెడ్లైన్: ఏప్రిల్ 2022
ప్రస్తుత డెడ్లైన్: జూన్ 2027
ప్రస్తుత పరిస్థితి: 50 శాతం పూర్తిప్రాజెక్ట్: ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే
ప్రాంతం: ఢిల్లీ-ముంబై
ఉద్దేశం: ప్రధాన నగరాలను కలిపే 12 లైన్ల రోడ్డు
ప్రకటన/శంకుస్థాపన: మార్చి 2019
వ్యయం: రూ. 98 వేల కోట్లు
ప్రారంభ డెడ్లైన్: డిసెంబర్ 2021
ప్రస్తుత డెడ్లైన్: మార్చి 2023
ప్రస్తుత పరిస్థితి: 40 శాతం పూర్తి
ప్రాజెక్ట్: గుజరాత్ హైబ్రిడ్ రిన్యూబుల్ ఎనర్జీ పార్క్
ప్రాంతం: కచ్, గుజరాత్
ఉద్దేశం: పునరుత్పాదక శక్తి కోసం
ప్రకటన/శంకుస్థాపన: సెప్టెంబర్ 2020
వ్యయం: రూ. 1.50 లక్షల కోట్లు
ప్రారంభ డెడ్లైన్: డిసెంబర్ 2021
ప్రస్తుత డెడ్లైన్: మార్చి 2022
ప్రస్తుత పరిస్థితి: 60 శాతం పూర్తి
ప్రాజెక్ట్: ఢిల్లీ-మీరట్ రీజనల్
ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్
ప్రాంతం: ఢిల్లీ-మీరట్
ఉద్దేశం: సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్
ప్రకటన/శంకుస్థాపన: మార్చి 2019
వ్యయం: రూ. 35 వేల కోట్లు
ప్రారంభ డెడ్లైన్: మార్చి 2023
ప్రస్తుత డెడ్లైన్: జూన్ 2025
ప్రస్తుత పరిస్థితి: 45 శాతం పూర్తి
ప్రాజెక్ట్: ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్
ప్రాంతం: ఢిల్లీ
ఉద్దేశం: అంతర్జాతీయ సదస్సులకై
ప్రకటన: సెప్టెంబర్ 2018
వ్యయం: రూ. 28 వేల కోట్లు
ప్రారంభ డెడ్లైన్: జనవరి 2023
ప్రస్తుత డెడ్లైన్: జనవరి 2023
ప్రస్తుత పరిస్థితి: 55 శాతం పూర్తి
జాబితాలో మరికొన్ని
రూ. 10 వేల కోట్ల నుంచి రూ. 70 వేల కోట్ల వ్యయంతో ప్రధాని మోదీ సర్కారు ప్రారంభించిన ధోలెరా సోలార్ పార్క్, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే, గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్వే, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్, ముంబై-నాగ్పూర్ ఎక్స్ప్రెస్వే, రాయ్పూర్-విశాఖ ఎక్స్ప్రెస్వే, ట్రాన్స్ హర్యానా ఎక్స్ప్రెస్వే, నార్త్-ఈస్ట్ రైల్వే కనెక్టివిటీ, చీనాబ్ బ్రిడ్జి, అంజిఖాడ్ బ్రిడ్జి, కోస్టల్ రోడ్, గిఫ్ట్ సిటీ, న్యూఢిల్లీ డబ్ల్యూటీసీ వంటి ప్రాజెక్టులకు ప్రారంభ డెడ్లైన్ ఎప్పుడో ముగిసిపోయింది. అయితే, ఇందులో ఏ ఒక్కటీ పూర్తికాలేదు.