కల్వకుర్తి రూరల్, జనవరి 21 : నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్కు చెందిన శేఖరాచారి సూక్ష్మ రామ మందిరం, కలశం, రాములవారి విల్లు, శ్రీరాముడి పాదుకలను అతి సూక్ష్మ ఆకృతిలో తీర్చిదిద్దారు. అయోధ్యలోని శ్రీరామమందిరంలో రాములవారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శేఖరాచారి సుమారు 9 గ్రాముల పంచలోహాలతో వీటిని తయారు చేశారు. వీటిని అయోధ్యకు పంపించనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే ఆయన కుమారుడు యశ్వంత్కుమార్ రామమందిర్ ఆలయ నమూనాను, చాక్పీస్పై రాములోరిని చిత్రించారు.