న్యూఢిల్లీ : సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) డెంగ్యూ, మలేరియాతో పోల్చుతూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సమర్ధించారు. కుల క్రమానుగత సమాజానికి సనాతన ధర్మం దిక్సూచి వంటిదని, సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేవారు దీని నుంచి లబ్ధిపొందిన ఉన్నత వర్గానికి చెందిన వారని తమిళనాడు శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు.
కాగా సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకమని ఉదయనిధి స్టాలిన్ శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. దీన్ని వ్యతిరేకించడమే కాదు..రద్దు చేయాలని అన్నారు. మనం డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనాను వ్యతిరేకించడం కాదు..వాటిని నిర్మూలించాలని అదేమాదిరిగా మనం సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మరోవైపు దేశంలో సనాతన ధర్మాన్ని అనుసరించే 80 శాతం మంది ప్రజల ఊచకోతకు డీఎంకే నేత పిలుపు ఇవ్వడం దారుణమని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు.
ఉదయనిధి స్టాలిన్ ప్రసంగ వీడియోను హిందీ సబ్టైటిల్స్తో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ భాగస్వామ్య పక్షం డీఎంకే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కోరుతోంది. డీఎంకే నరమేధం పిలుపుపై కాంగ్రెస్ మౌనం దాల్చిందని ఆయన మండిపడ్డారు. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వందల ఏండ్ల నాటి భారత్ సంస్కృతిని మంటగలుపుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Sonia Gandhi | కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత