లక్నో: కొందరు యువకులు ఒక విద్యార్థిని కిడ్నాప్ చేశారు. అతడ్ని కొట్టడంతోపాటు ముఖంపై మూత్ర విసర్జన చేశారు. (Miscreants Urinate On Student’s Face) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 13న దీపావళి సందర్భంగా 12వ తరగతి చదువుతున్న విద్యార్థి స్వీట్లు ఇచ్చేందుకు తన బంధువు ఇంటికి వెళ్తున్నాడు. కొంత మంది యువకులు అతడ్ని అడ్డగించి కిడ్నాప్ చేశారు. సమీపంలోని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ విద్యార్థిని దారుణంగా కొట్టారు. ఒక వ్యక్తి అతడి ముఖంపై మూత్ర విసర్జన చేశాడు. దీనిని వీడియో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ విద్యార్థి తండ్రి ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆ విద్యార్థి తండ్రి ఆరోపించాడు. కిడ్నాప్ సెక్షన్ను కేసులో చేర్చలేదని విమర్శించాడు.
मेरठ में 12वीं का छात्र करन चौधरी दिवाली की मिठाई देने मौसी के घर जा रहा था। रास्ते से कुछ लड़के उठाकर जंगल में ले गए। बर्बरता से पीटा, उसके ऊपर पेशाब किया। अवि शर्मा, आशीष मलिक, राजन, मोहित ठाकुर पर FIR हुई है लेकिन बेहद हल्की धाराओं में।#Meerut #Up pic.twitter.com/VeinRn2Z9L
— Sachin Gupta (@SachinGuptaUP) November 26, 2023
Meerut: A student was kidnapped by the goons during Diwali, He was held hostage and beaten. After beating him up they urinated on his face. pic.twitter.com/DOdwJMksLo
— Mohammed Zubair (@zoo_bear) November 26, 2023