న్యూఢిల్లీ: దేశంలో మైనర్లు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. 10 నుంచి 17 ఏండ్ల మధ్య వయసున్న మైనర్లలో దాదాపు 1.58 కోట్ల మందికి మత్తు పదార్థాల అలవాటు ఉన్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించామని, ముఖ్యంగా మైనర్లు, యువత మద్యానికి, డ్రగ్స్కు బానిసలవుతున్నట్టు గుర్తించామని వెల్లడించింది. దేశంలో దాదాపు 16 కోట్ల మందికి మందు అలవాటు ఉన్నదని, 3.1 కోట్ల మంది గంజాయి తాగుతున్నారని, 2.26 కోట్ల మందికి డ్రగ్స్ అలవాటు ఉన్నదని పేర్కొంది. ఛత్తీస్గఢ్, త్రిపుర, పంజాబ్, అరుణాచల్ప్రదేశ్, గోవాలో మద్యం వినియోగం అధికంగా ఉన్నదని కేంద్రం తెలిపింది.