రాంచీ, ఏప్రిల్ 11: ఎన్నికలకు ముందు జార్ఖండ్లో భద్రతా దళాలు గొప్ప విజయాన్ని సాధించాయి. ఒక మైనర్, ఇద్దరు మహిళలు సహా కరుడుగట్టిన రెడ్ రెబెల్ మిసిర్ బెస్రా దళానికి చెందిన 15 మంది నక్సల్స్ తమ ఆయుధాలను వదిలి గురువారం పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్టుల డెన్ అయిన సింగ్భూమ్లోని పలు మారుమూల ప్రాంతాల్లో చాలా దశాబ్దాల తర్వాత తొలిసారిగా మే 13న ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వీరి లొంగుబాటు పోలీసుల విజయంగా అధికారులు భావిస్తున్నారు.