KCR | పాట్నా, మార్చి 19: తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. బీహార్ పర్యటనలో ఉన్న ఆయన కిసన్ఘంజ్ జిల్లాలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారా? అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఒవైసీ స్పందిస్తూ.. కేసీఆర్కు గొప్ప దార్శనికుడు అని, ఆయన తన హయాంలో రాష్ర్టాభివృద్ధికి ఇప్పటి వరకు ఎంతో చేశారని కొనియాడారు. తెలంగాణకు సముద్ర తీరం లేనప్పటికీ, మెరుగైన స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి(జీఎస్డీపీ)తో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని అన్నారు. పంపు సెట్ల వినియోగంలో మొదటి స్థానంలో ఉన్నదని, మత్స్యసంపద విషయంలో రెండో అతిపెద్ద ఉత్పతిదారుగా ఉన్నదని పేర్కొన్నారు.