హైదరాబాద్ : సోషల్ మీడియాలో రాబోయే ఎన్నికలకు సంబంధించిన చర్చను సజావుగా సాగే దిశగా, దేశంలోని మొట్టమొదటి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫామ్ “కూ” యాప్ వాలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్’ను పాటిస్తుంది. మొదటిసారిగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎమ్ఏఐ) రూపొందించిన స్వచ్ఛంద ప్రవర్తనా నియమావళిని 2019 సాధారణ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల కమిషన్కు సమర్పించారు. ఈ ప్రవర్తనా నియమావళి ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను నిష్పక్షపాతంగా ఉపయోగించడం కోసం సిద్ధమైంది “కూ” యాప్.
మధ్య ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా,మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవర్తనా నియమావళిని అనుసరించడం ద్వారా, కూ యాప్ అనేది వినియోగదారులకు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తూ సురక్షితమైన, న్యాయమైన ఎన్నికలకు కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తుంది. అదే సమయంలో “కూ” యాప్ బాధ్యతాయుతమైన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ గా వ్యవహరిస్తుంది.
కూ యాప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ, “నేడు ప్రజల జీవితాల్లో సోషల్ మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ప్రక్రియ గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో, అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో వారిని ప్రభావితం చేయడంలో ఉపకరిస్తుంది. నిష్పాక్షికమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా ఐఏఎమ్ఏఐ రూపొందించిన స్వచ్ఛంద నియమావళికి, అందులో ఉన్న ప్రతి అక్షరానికి “కూ” కట్టుబడి ఉంటుందని “అన్నారు.