న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) క్లారిటీ ఇచ్చింది. తొలి సమావేశం ఇచ్చిన జోష్తో ఈ నెల 17, 18 తేదీల్లో ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఒక ట్వీట్ చేశారు.
‘తాము గత నెల బీహార్ రాజధాని పట్నాలో నిర్వహించుకున్న తొలి సమావేశం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అదే ఊపుతో ఈ నెల 17, 18 తేదీల్లో కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నాం. నియంతృత్వ, అప్రజాస్వామిక శక్తులను ఓడించడమే లక్ష్యంగా మేం పనిచేస్తున్నాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఓ సాహసోపేతమైన లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం’ అని కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.
కాగా, దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ నెల 13, 14 తేదీల్లో సమావేశం కావాలని ముందుగా నిర్ణయించుకున్నాయి. తొలి సమావేశం ముగియగానే ఈ విషయాన్ని వెల్లడించాయి. కానీ ఆ తర్వాత సమావేశం వాయిదా వేస్తున్నట్లు తెలిపాయి. దాంతో ఇక ప్రతిపక్షాల రెండో సమావేశం లేనట్లే అని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ ట్విటర్లో తేదీలు ప్రకటించి సమావేశంపై క్లారిటీ ఇచ్చారు.
Meeting of opposition parties will be held on 17th & 18th July in Bengaluru, tweets Congress General Secretary KC Venugopal. pic.twitter.com/IbixTKUpDy
— ANI (@ANI) July 3, 2023