చెన్నారావుపేట, మే 23 : కొవిడ్ బాధితులు ధైర్యంగా ఉం డాలని, వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. ఆదివారం మండలంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షల వివరాలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కొవిడ్ బాధితులకు ధైర్యం కల్పించాల్సిన బాధ్యత వైద్యం సిబ్బందిపైనే ఉందన్నారు. హోం ఐసొలేషన్లో ఉండి ఇబ్బందులు పడుతున్న వారు నర్సంపేటలోని ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కొవిడ్ పరీక్షలు కోసం వచ్చిన వారితో మాట్లాడి నేను న్నానంటూ మనోధైర్యం కల్పించారు. అలాగే మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు గన్నీ బ్యాగుల కొరత, ట్రాన్స్పోర్ట్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, సర్పంచ్ కుండె మల్లయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, మాజీ జడ్పీటీసీ రాం రెడ్డి, సొసైటీ చైర్మన్ ఎం సత్యనారాయణరెడ్డి, నాయకులు జే మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు మహమ్మద్ రఫీ, పీహెచ్సీ సిబ్బంది కుండె శివాజి, స్వరూపరాణి పాల్గొన్నారు.