న్యూఢిల్లీ, జూన్ 3: నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయి క్యాన్సిల్ కావడం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపుతున్నదో చూస్తున్నాం. జూన్ 21న పేపర్ రీఎగ్జామ్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించబోతున్నది. అయితే నీట్ స్కామ్లో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. బ్రోకర్లు స్టూడెంట్లకు గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని.. ఇందుకోసం రూ.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారట. లీక్ అయిన పేపర్ను అమ్మడానికి ఒక్కరి దగ్గరి నుంచి రూ.15 లక్షలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మరికొందరికి నేరుగా సీట్లు ఎరగా వేశారట. అహ్మదాబాద్కు చెందిన శుభమ్ థాకేర్ తనతో సదరు బ్రోకర్లు మెడికల్ సీట్లను ఆఫర్ చేస్తూ మాట్లాడిన ఆడియో కాల్ను రికార్డు చేసి బయటపెట్టాడు.
ఏమీ రాయకుండా వదిలేయాలి..
ఈ మెడికల్ సీట్ల కోసం విద్యార్థులకు బ్రోకర్లు కొన్ని సూచనలు చేశారు. ఎవరైతే సీట్లు కావాలనుకుంటారో వాళ్ల్లు ఎగ్జామ్ ఆన్సర్ షీట్లలో ఏమీ రాయకుండా ప్లేన్గా వదిలేయాలి. ఆ ఎగ్జామ్ సెంటర్లలో ఉండే కొందరు స్టాఫ్ మెంబర్లు, అధికారులు ఆ ఆన్సర్ షీట్లను సరైన సమాధానాలతో నింపుతారు. వీళ్లు సదరు బ్రోకర్ల నుంచి ఇందుకోసం పేమెంట్ తీసుకుంటారట. అయితే మెరుగైన ర్యాంకులు వచ్చే స్థాయిలో కాకుండా గవర్నమెంట్ కాలేజీల్లో మెడికల్ సీట్లు వచ్చే స్థాయిలో ఆన్సర్లు నింపుతారట. ఈ విషయంపై ఇప్పుడు మరో రచ్చ జరుగుతున్నది. ఎగ్జామ్ సెంటర్లలో అధికారులు కూడా అమ్ముడుపోయారా? అంటూ స్టూడెంట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.