భోపాల్: కేరళలోని కొచ్చిన్ నుంచి ఢిల్లీ (Delhi) వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight) భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ఇండిగో ఎయిర్లైన్స్కి చెందిన 6ఈ2407 విమానం కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నది. అయితే విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడి ఆరోగ్యం విషమించడంతో విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అత్యవసర పరిస్థితిలో (Medical emergency) విమానాన్ని భోపాల్కు (Bhopal) దారిమళ్లించారు. అప్పటికే ఎయిర్పోర్టులో సిద్ధంగా ఉన్న సిబ్బంది.. ప్రయాణికుడిని హుటాహుటిన సమీపంలోని దవాఖానకు తరలించారు. అయితే దీనివల్ల ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఇండిగో ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో వెళ్లడించింది. మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో విమానాన్ని భోపాల్కు దారిమళ్లించినట్లు తెలిపింది.
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (Air India Express) బోయింగ్ బీ-737 విమానానికి (Boeing B-737 flight) శుక్రవారం తృటిలో పెనుప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. 176 మంది ప్రయాణికులు సహా ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఫ్లైట్ ఎమర్జెన్సీ మోడ్లో సురక్షితంగా దిగింది. కాలికట్ విమానాశ్రయం నుంచి శుక్రవారం సౌదీ అరేబియాలోని దమ్మానికి వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఎగిరే సమయంలో తోకభాగం రన్వేను ఢీకొట్టింది. వెంటనే ప్రమాదాన్ని గ్రహించిన పైలట్ వెనక్కి తిప్పి తిరువనంతపురంలోఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి కోరారు. ల్యాండింగ్కు ముందు విమానం బరువును తగ్గించేందుకు ఇంధనాన్ని ఖాళీ చేయడానికి పైలట్ విమానాశ్రయం చుట్టూ గంటపాటు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.