జీవ వైవిధ్యానికి నెలవైన హిమాలయాల్లో మరో అరుదైన మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. మాంసం తినే ఉట్రికులేరియా ఫర్సెల్లేటా అనే మొక్కను మొదటిసారి హిమాలయాల్లో గుర్తించినట్టు ఉత్తరాఖండ్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (రిసెర్చ్) సంజీవ్ చతుర్వేది శనివారం వెల్లడించారు. చమోలీ జిల్లాలోని మండల్ లోయలో ఈ మొక్కను గుర్తించినట్టు తెలిపారు. ఈ మొక్కలు కీటకాలను ట్రాప్చేసి తినేస్తాయి.