Flight Disruptions | గత కొన్ని రోజులుగా ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతోపాటు చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. సఫ్దర్జంగ్లో 5.6 డిగ్రీలుగా రికార్డయిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో న్యూఢిల్లీకి రావాల్సిన 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ‘వాతావరణం అనుకూలించని కారణంగా ఢిల్లీకి రావాల్సిన దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలను దారి మల్లించాము’ అని ఢిల్లీ విమానాశ్రయం అధికారులు తెలిపారు.
కాగా, దట్టమైన పొగమంచు సూర్యరశ్మిని కప్పి ఉంచటంతోపాటు వాయువ్య మైదానాల గుండా వీస్తున్న చల్లని గాలులతో పగటిపూత ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు, మూడు రోజులపాటు వాతావరణం ఇదే విధంగా ఉంటుందని వెల్లడించారు.