జమ్ము, ఏప్రిల్ 22: జమ్ములో భారీ ఉగ్రదాడికి కుట్ర జరిగింది. ముష్కరుల పన్నాగాన్ని పసిగట్టిన జవాన్లు దాన్ని భగ్నం చేశారు. ఈక్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ (జేఈఎం)కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు మరణించారు. తొమ్మిది మంది సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి.
జమ్ము శివార్లలోని సంజ్వానా ఆర్మీ క్యాంప్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రధాని మోదీ జమ్ములోని సాంబాలో పర్యటించాల్సి ఉన్నది. 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక, ప్రధాని ఆ ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి.