న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్ను అభివృద్ధి చేసేందుకు పలు టెక్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాల పట్ల పలువురు టెక్, ఏఐ నిపుణులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్, చరిత్రకారుడు యువల్ నోవాహ్ హరారి, ఏఐ రంగంలో నిపుణుడు యోషువా బెంగియోసహా వెయ్యిమంది నిపు ణులు బహిరంగ లేఖ రాశారు. ఏఐ టూల్స్ అభివృద్ధిని 6 నెలల పాటు ఆపేయాలని కోరారు. ఏఐ టూల్స్ వల్ల సానుకూల ప్రభావాలే ఉంటాయని, వీటితో ఏర్పడబోయే ముప్పును నివారించగలమని నమ్మకం కలిగిన తర్వాతే అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.