ధరమ్పూర్, అక్టోబర్ 9: గుజరాత్లో చాలా మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు తమ పార్టీకి రహస్యంగా మద్దతు పలుకుతున్నారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వారంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. చాలా మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు తనను కలిశారని, సొంత పార్టీ బీజేపీని ఓడించేందుకు ఏదైనా చేయాలని కోరారని తెలిపారు. 27 ఏండ్ల బీజేపీ పాలనకు స్వస్తి పలకాల్సిన అవసరము న్నదని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.