ముంబై: ఈ నెల 24 నాటికి మరాఠాలకు రిజర్వేషన్లు మంజూరు చేయకపోతే, 25 నుంచి నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని మనోజ్ జరాంగే హెచ్చరించారు. తమ డిమాండ్ నెరవేర్చే వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా రాజకీయ నాయకులను తమ గ్రామాల్లోకి అడుగు పెట్టనివ్వబోమన్నారు. ఆదివారం జల్నా జిల్లాలోని అంతర్వాలీ సరటి గ్రామంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఓబీసీ క్యాటగిరీ కింద మరాఠాలకు రిజర్వేషన్ల మంజూరుకు ప్రభుత్వానికి 40 రోజులపాటు గడువు ఇస్తూ ఆయన గత నెల దీక్ష విరమించారు.