న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి చెందిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సోమవారం అరెస్ట్ చేస్తారని ఆ పార్టీ అంచనా వేసింది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ భయపడుతుందని, తమ పార్టీని ఎదుర్కోలేకనే ఆప్ నేతలను అరెస్ట్ చేస్తున్నదని ఆ పార్టీ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుపై ప్రశ్నించేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయానికి రావాలంటూ దీనిపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసింది.
దీనిపై మనీష్ సిసోడియా స్పందించారు. సీబీఐ ఇటీవల తన కార్యాలయం, నివాసంలో నిర్వహించిన తనిఖీల్లో ఏమీ లభించలేదని తెలిపారు. అయినప్పటికీ దర్యాప్తు కోసం పూర్తిగా సహకరిస్తానని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ట్వీట్ చేశారు.
మరోవైపు సిసోడియాకు సీబీఐ సమన్లు పంపడంపై ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. స్వాతంత్ర్య పోరాటయోధుడు భగత్ సింగ్తో ఆయనను పోల్చారు. ‘జైలు ఊచలు, ఉరి కూడా భగత్ సింగ్ దృఢ సంకల్పాన్ని అడ్డుకోలేకపోయాయి. స్వాతంత్ర్యం కోసం ఇది రెండో పోరాటం. మనీష్, సత్యేంద్ర (జైన్) నేటి భగత్ సింగ్లు’ అని ట్వీట్ చేశారు.
मेरे घर पर 14 घंटे CBI रेड कराई, कुछ नहीं निकला. मेरा बैंक लॉकर तलाशा, उसमें कुछ नहीं निकला. मेरे गाँव में इन्हें कुछ नहीं मिला.
अब इन्होंने कल 11 बजे मुझे CBI मुख्यालय बुलाया है. मैं जाऊँगा और पूरा सहयोग करूँगा.
सत्यमेव जयते.
— Manish Sisodia (@msisodia) October 16, 2022
जेल की सलाख़ें और फाँसी का फंदा भगत सिंह के बुलंद इरादों को डिगा नहीं पाये
ये आज़ादी की दूसरी लड़ाई है।मनीष और सत्येंद्र आज के भगत सिंह है
75 साल बाद देश को एक शिक्षा मंत्री मिला जिसने ग़रीबों को अच्छी शिक्षा देकर सुनहरे भविष्य की उम्मीद दी
करोड़ों ग़रीबों की दुआएँ आपके साथ है https://t.co/slc3lb1Mqp
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 16, 2022