Manish Sisodia | ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు నిరాశ తప్పలేదు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియా బెయిల్ను తిరస్కరించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. మద్యం పాలసీ కేసులో సిసోడియాను ఈడీ మార్చి 9న అరెస్టు చేసింది. ఇక సిసోడియాతో పాటు నిందితులుగా ఉన్న రాజేశ్ జోషి, గౌతమ్ మల్హోత్రా బెయిల్ పిటిషన్పై తీర్పు మే 6వ తేదీకి వాయిదా వేసింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలనీకి సంబంధించిన మనీలాండింగ్ కేసును ఈడీ విచారణ జరుపుతోంది. పాలసీని రూపొందించడం, అమలులో సిసోడియా కీలక పాత్ర పోషించారని, మనీలాండింగ్ కేసులో ఆయన అరెస్ట్ న్యాయమేనని కోర్టు పేర్కొంది. కొన్ని ప్రైవేటు కంపెనీలకు హోల్సేల్ ట్రేడింగ్ లాభం 12శాతం ఇవ్వాలనే కుట్రలో భాగంగానే పాలసీని తీసుకువచ్చారని ఈడీ ఆరోపించింది. సిసోడియా 14 ఫోన్లను ధ్వంసం చేసిందని, వాటిలో రెండు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది. ఇతర వ్యక్తుల పేరుతో సిమ్కార్డులు, ఫోన్లను ఆప్ నాయకుడు కొనుగోలు చేసి వాడినట్లు ఆరోపించింది.