Manish Sisodia | మద్యం పాలసీ కేసు (Liquor Policy Case) లో అరెస్టైన ఆప్ (AAP) నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం (former Deputy Chief Minister ) మనీశ్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody)ని కోర్టు మరోసారి పొడిగించింది. సిసోడియాను ఈడీ నేడు కోర్టులో హాజరుపరచగా.. ఆయన కస్టడీని కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. ఏప్రిల్ 5వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody) విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మనీశ్ సిసోడియాకు నేటితో ఈడీ (ED) కస్టడీ ముగియడంతో, ఆయనను అధికారులు స్పెషల్ జడ్జి ఎంకే నాగ్పాల్ (M K Nagpal) ఎదుట హాజరుపరిచారు. సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
మరోవైపు సిసోడియా బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ (CBI) కేసులో సిసోడియా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కోర్టు మంగళవారం విచారణ జరిపింది. అవినీతి కేసులో గత నెల 26 సిసోడియా అరెస్టయిన విషయం తెలిసిందే.
Also Read..
Delhi Quake | హిందూకుష్ పర్వతాల్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ఊగిపోయిన భవనాలు.. వీడియోలు వైరల్..!
India Corona | దేశంలో ఏడు వేలు దాటిన యాక్టివ్ కేసులు
Delhi Man Suicide | వైద్య ఖర్చులు భారం కావడంతో బలవన్మరణానికి పాల్పడిన యువకుడు